కట్టంగూర్(నకిరేకల్), మే 24 : నకిరేకల్ పట్టణంలో సబ్ కోర్టు భవన నిర్మాణ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సబ్ కోర్టు నిర్మాణం కోసం కేటాయించిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు, న్యాయవాదులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోర్టు భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గరిగంటి ఓంకార్, జాయింట్ సెకట్రరీ నోముల కేశవరాజు, న్యాయవాదులు వంగూరి వెంకన్న, పగడాల మదన్మోహన్, బొబ్బిలి నర్సింహ, పోతుల మల్లయ్య, హఫీజ్, అక్కెనపల్లి వీరస్వామి, నర్సింగ్ విజయ్, కొండ యాదగిరి, జాల కొమురయ్య, బచ్చుపల్లి ప్రకాశ్రావు, కృష్ణకాంత్ పాల్గొన్నారు.