నీలగిరి, మే 24 : ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా మాతాశిశు సంరక్షణ విభాగానికి వెళ్లి సౌకర్యాల గురించి వైద్యులు, రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెటర్నిటీ విభాగాన్ని తనిఖీ చేశారు. అక్కడ రోగులు, సహాయకులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించి పునరావృతంకాకుండా చూడాలని సూపరింటెండెంట్ లచ్చు నాయక్కు సూచించారు.
మెడికల్ కళాశాల డైనింగ్, హాస్టల్ను పరిశీలించి విద్యార్థ్ధులతో మాట్లాడారు. అనంతరం సూ పరింటెండెంట్ చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో చేపట్టాల్సిన వైద్య సేవలు, పనులపై ప్రణాళిక రూపొందించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. దవాఖాన పరిసరాలను పరిశుభ్రంగా ఉం చాలని సిబ్బందికి సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డా.లచ్చు నాయక్, ప్రిన్సిపాల్ రాజకుమారి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రామరాజు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : మండలంలోని మేళ్లదుప్పలపల్లిలో రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం కనుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, సర్పంచ్ మనిమద్దె పద్మావతీసైదులు, చింతల యాదగిరి, పొడిచేటి రవీందర్, బడుపుల శంకర్, అనిల్కుమార్, ఎల్లయ్య ,భిక్షం, సుధాకర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నగేశ్, టి.అశోక్, శేఖర్, లింగస్వామి, యాదగిరి, మేకల జయమ్మ పాల్గొన్నారు.