సూర్యాపేట రూరల్, మే 23 : గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభు త్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని టేకుమట్ల గ్రామ శివారులో రూ. 15లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెరాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
మండలంలోని కేసారంలో సంత్ నిరంకారి భవన నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పట్టణంలోని 13వార్డు గాంధీనగర్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని ప్రారంభించారు. కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్నాయుడు, సర్పంచ్ పిండిగ పద్మ, నాయకులు శ్రీధర్రెడ్డి, సైదులు, అనంతరెడ్డి, లింగారెడ్డి, నాగేందర్, సుదర్శన్రెడ్డి, నవీన్గౌడ్, చాంద్పాష, రఫీ, సునీల్రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.
పట్టణ పరిధిలోని రాయిన్గూడెం గ్రామ టీఆర్ఎస్ నాయకులు కొణతం శ్రీనివాస్రెడ్డి మాతృమూర్తి రుక్కమ్మ మృతిచెందింది. సోమవారం ఆమె మృతదేహాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్నాయుడు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు చిత్తలూరి కృష్ణ, సైదులు పాల్గొన్నారు.
సూర్యాపేట టౌన్ : రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ను రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజుయాదవ్ సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, పెద్దగట్టు ఆలయ చైర్మన్ కోడి సైదులు ఉన్నారు.
జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మొరిశెట్టి ఉపేందర్ తండ్రి మొరిశెట్టి కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతుండగా సోమవారం ద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పరామ ర్శించారు. కృష్ణమూర్తి ఆరోగ్య వివరాలడిగి తెలు సుకున్నారు. కుటుంబసభ్యులు మొరిశెట్టి ఉపేందర్, యోగి, శ్రీనివాస్, మధు, వేణు, నాయ కులు రేణుబాబు, మధు ఉన్నారు.
ఆత్మకూర్.ఎస్ : మండలంలోని గట్టికల్ గ్రామంలో సఖి సెంటర్ అందిస్తున్న సేవలపై సోమవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల్లో అసమానతలు, వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. స్త్రీ, పురుష సంబంధాల్లో అసమానతలు ఏర్పడి గృహ హింసకు దారి తీస్తున్నాయని, గృహ హింసకు గురయ్యే స్త్రీలకు ఉపశమనం కలిగించేలా ఏర్పడిందే సఖి కేంద్రమని మంత్రి పేర్కొ న్నారు. చట్టాలు, సఖి కేంద్రం సేవలను వివరించారు. సఖి కేంద్రం సిబ్బంది సేవలు, సలహాలు, కౌన్సెలింగ్, హెల్ప్లైన్ 181 అవశ్యకతను మంత్రికి వివరించారు. కేంద్రం నిర్వాహకులు శైలజ, చైతన్య, సుజాత, స్వప్న పాల్గొన్నారు.