సూర్యాపేట సిటీ, మే 23 : డ్రగ్స్ రవాణా, సైబర్ నేరాల నిరోధానికి ప్రభుత్వం రూపొందించిన దూఫంస్, సైకాప్స్ అప్లికేషన్లపై జిల్లా పోలీసు అధికారులు, సైబర్ వారియర్ సిబ్బందికి సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్(సీఐ)సెల్ ఎస్పీ దేవేందర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ అవగాహన కల్పించారు. నేరాలకు పాల్పడే నిందితులు, నేరస్తుల పూర్తి వివరాలను అన్ని జిల్లాల పోలీసు సిబ్బందికి అందుబాటులో ఉంచడం కోసం అప్లికేషన్ రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఐ సెల్ ఎస్పీ దేవేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లు, పోలీసు కార్యాలయాల్లో అప్లికేషన్లు ఓపెన్ చేయవచ్చన్నారు. నేరస్తులు ఎలాంటి డ్రగ్స్తో వ్యాపారం చేస్తున్నారు రవాణా నేరస్తుడిపై ఎన్ని కేసులు ఉన్నాయి ఎక్కడ ఉంటాడు.. జీవన స్థితిగతులను ఈ అప్లికేషన్లో నమోదు చేయబడుతాయని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ కేసుల దర్యాప్తులో బాగా పని చేయాలని పోలీసుశాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. డీఎస్పీలు మోహన్కుమార్, రెహమాన్, సీఐ, ఎస్హెచ్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేటసిటీ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 16 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుదారులతో మా ట్లాడి వినతులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృద్ధులను వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు.
ఆర్ముడ్ రిజర్వ్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన కోటిరెడ్డి, సూర్యాపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దావుల వీరప్రసాద్ ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలకు చేయూత పథకం కింద మంజూరైన చెక్కులను ఎస్పీ రాజేంద్రప్రసాద్ అందించారు. కార్యక్రమంలో పోలీసు సంక్షేమ ఆర్ఐ గోవిందరావు, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్గౌడ్ ఉన్నారు.