నల్లగొండ ప్రతినిధి, జనవరి 8(నమస్తే తెలంగాణ) : నల్లగొండ కలెక్టర్గా దాసరి హరిచందన సోమవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ను గత నెల 17న ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ డైరెక్టర్గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఉన్న హేమంత్ కేశవ్ పాటిల్ ఇన్చార్జి కలెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సోమవారం హేమంత్ కేశవ్ పాటిల్ నుంచి కలెక్టర్గా దాసరి హరిచందన బాధ్యతలు స్వీకరించారు.
హరిచందన ఇప్పటివరకు ఆయూష్ కమిషనర్ బాధ్యతలతో పాటు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తుండగా ఈ నెల 3న జిల్లా కలెక్టర్గా బదిలీపై వచ్చారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న హరిచందనకు కలెక్టరేట్ అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం నేరుగా తన చాంబర్కు చేరుకొని కలెక్టర్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ చందనాదీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) జె.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, అర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలెక్టర్ హరిచందనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.