మాడ్గులపల్లి, నవంబర్ 16: ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఇందుగుల, చెరువుపల్లి, దాచారం, కొత్తగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. నిరంతర విద్యుత్ అందించిన సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు దేశానికి, రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండని కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నియోజకవర్గంలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నా రు. 20 ఏండ్లుగా ఎండిపోయిన ఇందుగుల చెరువులో నీటిని నింపి రైతులకు ఆసరాగా నిలిచానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకారం సౌభాగ్యలక్ష్మి పథకంతో మహిళలకు రూ.3 వేల భృతి అందించడంతోపాటు వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు రూ.6వేలకు పెంచే బాధ్య త సీఎం కేసీఆర్ తీసుకుంటారన్నారు. నన్ను ఓడి ంచేందుకు కాంగ్రెస్ నాయకులు స్వతంత్ర అభ్యర్ధులను బరిలో దించారని, ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో గెలుపు నాదేనన్నారు ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే తనను ప్రజలు గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, ఎంపీపీ పోకల శ్రీవిద్యారాజు, వైస్ ఎంపీపీ సూదిరెడ్డి సుమలతాశ్రీనివాస్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, సర్పంచులు బొర్రాజు సైదమ్మా సైదులు, సింగం శివ, నాయకులు గాదె వెంకట్రెడ్డి, వెన్న శ్రవణ్రెడ్డి, దర్శనం రాంబాబు, కట్టా దామోదర్రెడ్డి, పోడూ రి శ్రీను, కోల ఎల్లయ్య, రాంబాబు, ఏడుకొండలు, నరేందర్రెడ్డి, శ్రవణ్రెడ్డి పాల్గొన్నారు.
తిప్పర్తి : ఆవాస గ్రామాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని సిలార్మియాగూడెం, గంగన్నపాలెం, కాశివారిగూడెం, రాయినిగూడెం, జొన్నగడ్డలగూడెం, అంతయ్య గూడెం గ్రామా ల్లో గురువారం ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనంతో పల్లెలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయన్నారు. నాయకులు డబ్బులకు అమ్ముడు పోయినా ప్రజలు మాత్రం బీఆర్ ఎస్ వైపే ఉన్నారన్నారు.