అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ, మార్చి30: యా సంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అధికాలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత సీజన్లో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నట్లు తెలిపారు. ఈ సారి కూడా అంతే స్థాయిలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాన్నదని, అందులో 1.89 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం ఉంటుందన్నారు. మరో 2 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లర్లు కొనుగోలు చేయగా, 12వేల మెట్రిక్ టన్నులు స్థానిక వినియోగానికి పోగా మిగిలిన 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందన్నారు. ఈ సారి కూడ 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం 70 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో కోటి బ్యాగులు తెప్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సైప్లె డీఎం నాగేశ్వర్ రావు, జేడీఏ శ్రీధర్రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.