హాలియా, జూన్25 : అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మూడు నెలల క్రితం హాలియాలో రైతు ధన్యవాద సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యేతో పాటు సర్పంచులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రూ.56.60 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమతీపురుషోత్తం, మున్సిపల్ చైర్పర్సన్ సలహాదారుడు వెంపటి శంకరయ్య, నాయకులు యడవల్లి మహేందర్రెడ్డి, రావుల రాంబాబు, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, అన్నెపాక శ్రీనివాస్, ప్రసాద్ నాయక్, చాపల సైదులు పాల్గొన్నారు.
నందికొండ అభివృద్ధికి కృషి
నందికొండ : నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నందికొండలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి వాటిని కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషారెడ్డి, కమిషనర్ రవీందర్రెడ్డి, వైస్ చైర్మన్ మందరఘువీర్, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, మంగ్తా, రమేశ్జీ, పార్వతమ్మ, నిమ్మల ఇందిరాగౌడ్, నంద్యాల శ్వేత, నాగశిరీష, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న శరత్రెడ్డి, నాయకులు విక్రమ్, మోహన్నాయక్ పాల్గొన్నారు.
త్రిపురారంలో..
త్రిపురారం : గ్రామపంచాయతీలకు రూ.20 లక్షల ప్రత్యేక నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సర్పంచులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ హనుమంతునాయక్, జానూనాయక్, కాంతారావునాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధిలో దేశానికే ఆదర్శం
దేవరకొండ రూరల్ : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనునాయక్ అన్నారు. గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు, మండల కేంద్రాలకు రూ.30 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ జానీయాదవ్ ఆధ్వర్యంలో సర్పంచులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పనులతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు మునికుంట్ల విద్యావతీవెంకట్రెడ్డి, ఇద్దయ్య, అంజియాదవ్, వి.దీప్ల, రాజ్కుమార్, జైహింద్రెడ్డి, సీత్యానాయక్, ఎం.సత్తయ్య, కె.యాదయ్య, లక్ష్మణ్, యాదయ్య పాల్గొన్నారు.