నార్కట్పల్లి, మే 20 : గ్రామాల్లో కొవిడ్-19 నియంత్రణకు ఆశ కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ప్రాథమిక వైద్యశాలలో మండలంలోని ఆశ కార్యకర్తలకు పల్స్ ఆక్సీమీటర్లు, గ్లౌజ్లు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వర సర్వేను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, ఎంపీడీఓ సాంబశివరావు, ఎంపీటీసీ రాజిరెడ్డి, శ్రీధర్, వెంకట్రెడ్డి, బోయపల్లి శ్రీను, బాజ యాదయ్య పాల్గొన్నారు.
చెన్నుగూడెంలో మాస్కుల పంపీణీ
నల్లగొండ రూరల్ : నల్లగొండ మండలం చెన్నుగూడెం గ్రామంలో సర్పంచ్ గుండెబోయిన శ్రీలత గ్రామస్తులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు.
రామగిరిలో అన్నదానం
రామగిరి : నల్లగొండలోని రామగిరిలో గల శ్రీహరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్వాహకులు గురువారం అన్నదానం ప్రారంభించారు. లాక్డౌన్ ముగిసే వరకు అన్నదానం చేయనున్నట్లు ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ గురుస్వామి నోముల శ్యామ్, కలిశాన్ అశోక్, ప్రధానార్చకుడు బి.మహేశ్శర్మ(శివ), శ్రీశ్యామ్, కొండల్ పాల్గొన్నారు.
కరోనా పేషెంట్లకు గుడ్లు, సరుకులు పంపిణీ
శాలిగౌరారం : మండలంలోని గురజాల, చిత్తలూరు, శాలిగౌరారం, వల్లాల గ్రామాల్లో కరోనా పేషెంట్ల ఇంటికెళ్లి వారికి రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్ నిత్యావసర సరుకులు, గుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, గుజిలాల్ శేఖర్బాబు, పనికెర కృష్ణయ్య, రాజు, గణేశ్, కమలాకర్ ఉన్నారు. అదేవిధంగా ఊట్కూర్ గ్రామంలో సర్పంచ్ వేముల లింగయ్య వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ..
మర్రిగూడ : మండలంలోని ఖుదాభక్ష్పల్లి గ్రామ వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి పిచికారీ చేయించారు. అనంతరం గ్రామంలో కరోనాతో మృతిచెందిన పందుల కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల సాయం అందించారు. ఆయన వెంట సర్పంచ్ ఆంబోతు సుధాకర్నాయక్, ఉపసర్పంచ్ మైలారపు పార్వతమ్మ, టీఆర్ఎస్ నాయకులు పందుల పాండుగౌడ్, బొడ్డుపల్లి సైదులు ఉన్నారు.
మునుగోడు : మండలంలోని రావిగూడెంలో ప్రధాన వీధుల వెంట సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అత్యవసర పనులకు మాత్రమే గ్రామస్తులు బయటకు రావాలని కోరారు. ఆయన వెంట పాలకవర్గ సభ్యులు వెంకటయ్య, యాదయ్య, పరమేశ్ ఉన్నారు.
కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు
కట్టంగూర్(నకిరేకల్) : నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వ్యక్తి గురువారం కరోనాతో మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులతో కలిసి సొంత ఖర్చులతో అంత్యక్రియలు జరిపించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించారు. నకిరేకల్ పట్టణంలోని బాబాన్సాహెబ్గూడెంలో అనారోగ్యంతో మృతి చెందిన పెద్దపంగ వరమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందించారు.
శాలిగౌరారం/ కేతేపల్లి : శాలిగౌరారం మండలం గురజాల గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందగా సర్పంచ్ గుండా శ్రీనివాస్ దగ్గరుండి అంత్యక్రియలను పూర్తి చేయించారు. కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన మహిళ కరోనాతో మృతిచెందగా అంత్యక్రియలకు బంధువులు ముందుకురాకపోవడంతో సర్పంచ్, మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్యాదవ్ తన సిబ్బందితో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు.