నిడమనూరు, మే18 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండల సమగ్రాభివృద్ధికి పాటు పడాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీపీ బొల్లం జయమ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులు నివేదికలు చదువగా మిషన్ భగీరథ నీటి సరఫరాపై తుమ్మడం ఎంపీటీసీ పెదమాం యాదయ్య, రెవెన్యూ అధికారుల తీరుపై డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు నీటిని అందించాలని ఏఈ గ్రీష్మను ఆదేశించారు. ఎంపీపీ బొల్లం జయమ్మ మాట్లాడుతూ మండల కేంద్రంలో వరద నష్టం బాధితులకు ప్రభుత్వ సాయం అందించగా.. అర్హుల పేర్లు నమోదు చేయకుండా రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్ను ఎంపీపీ శాలువాతో సన్మానించారు. సమావేశంలో జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మండల పరిషత్ సలహాదారుడు బొల్లం రవి యాదవ్, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్రెడ్డి, నాయబ్ తాసీల్దార్ రషీద్, ఎంపీఓ రామలింగయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, వైద్యాధికారి డాక్టర్ మాధవ్ కుమార్, పీఆర్, ట్రాన్స్కో ఏఈ లు వరలక్ష్మి, కిషన్లాల్, మత్స్య అభివృద్ధి అధికారి సాల్మన్ రాజు, పశువైద్యాధికారి డాక్టర్ మేగ్యానాయక్, ఎంపీటీసీ భాస్కరి నాగేంద్ర, చింతమల్ల ప్రమీల, నన్నెబోయిన సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
హాలియా : అనుముల మండలం మదారిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే నోముల భగత్ను క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ గౌరవ సలహాదారుడు ఆవుల పురుషోత్తం, పేరూరు దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ పోశం శ్రీనివాస్గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ మున్నా, మార్కెట్ డైరెక్టర్ ఆవుల సైదులు, నాయకులు బెడుదూరి వెంకట్రెడ్డి, బూర్గు సైదులు పాల్గొన్నారు.