ఎమ్మెల్యే రవీంద్రకుమార్
పెద్దఅడిశర్లపల్లి, జూన్ 5 : కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అందించిన వరమని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం 59 మంది లబ్ధిదారులకు రూ.59 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మహిళల రక్షణ కోసం షీటీంతోపాటు ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
ఐసొలేషన్ కేంద్రాలు ప్రారంభం : మండలంలోని గుడిపల్లి, పీఏపల్లిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్ కేంద్రాలను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. కరోనా పేషెంట్లు బయట తిరగకుండా ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండి వైద్యుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి, ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, తాసీల్దార్ దేవదాసు, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత, సీఐ పరశురాం, ఎస్ఐ వీరబాబు, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, సర్పంచులు గోర్ల సైదమ్మ, శేఖర్రెడ్డి, నాయకులు ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కానుక
ఎమ్మెల్యే భాస్కర్రావు
మిర్యాలగూడ, జూన్ 5 : రాష్ట్రంలో ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి రూపంలో సీఎం కేసీఆర్ అపురూపమైన కానుక అందిస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన 206 మంది లబ్ధిదారులకు రూ.2,06,896 విలువైన చెక్కులను అందజేసి మాట్లాడారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆడబిడ్డలు మంచినీళ్లకు ఇబ్బందులు పడకూడదనే ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటారు. మంచి వాతావరణం కోసం ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వర్రావు, పెద్ది శ్రీనివాస్, నాగార్జునాచారి, ఉదయభాస్కర్, బాసాని గిరి, బంటు రమేశ్, శ్రీనివాస్, భీమ్లా, గోవిందరెడ్డి, వెంకటేశ్వర్లు, ఇలియాస్, నవాబ్, ఖాదర్ పాల్గొన్నారు.