అర్వపల్లి, జూలై 2 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత సాధికారత పథకానికి శ్రీకారం చుట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బందెల అర్వపల్లి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ చిత్రపటాలకు దళిత సంఘాలతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్ను దళితజాతి ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పి.యుగేంధర్, సురేందర్, వీరస్వామి, వెంకన్న, లింగస్వామి, శశికాంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
చందంపేట : దళిత సాధికారతకు రూ. 1200 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మండలంలోని చిత్రియాల గ్రామంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ డైరెక్టర్ బోయపల్లి రాములు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు పోషం శ్రీను, బుచ్చయ్య పాల్గొన్నారు.
పాలకవీడులో..
పాలకవీడు: మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళిత సాధికారతతో తమ జీవితాలు మారనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాక పాపయ్య, నాగయ్య, రాము, పెరుమాళ్ల సతీశ్, చందు, మరియాదాస్, విజయ్, సంజీవ్, రాజీవ్, బాలు పాల్గొన్నారు.