నకిరేకల్/నార్కట్పల్లి/చిట్యాల, డిసెంబర్ 28 : అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులకు సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం నకిరేకల్ పట్టణంలోని 7,8,9,10 వార్డుల్లో నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో, చిట్యాలలోని 1వ వార్డు, తాళ్లవెల్లంల, వేంబావి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ స్కీంలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ, ప్రత్యేకాధికారులు విద్యాసాగర్, గౌతమ్, కౌన్సిలర్లు కొండ శ్రీను, గాజుల సుకన్య, చౌగోని అఖిల లక్ష్మణ్, చౌగోని శ్రీనూరజిత, పన్నాల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని తాటికల్, మంగళపల్లి, గోరెంకలపల్లి, మోదినిగూడెం గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవీ గంగాధర్రావు, తాసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రమేశ్ దీన్దయాళ్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, సీఐ మహేశ్, ఎస్ఐలు రవి, నవీన్, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నార్కట్పల్లి మండలంలోని బాజకుంట, చెర్వుగట్టు, కొండపాకగూడెం, గోపలాయపల్లి గ్రామాల్లో ఎంపీడీఓ యాదగిరి, తాసీల్దార్ పద్మ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించారు.
మిర్యాలగూడ : ప్రజలందరూ సంయమనం పాటిస్తూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 1,2,3,4,5,6,8 వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న అభయహస్తం పథకాలకు దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందన్నారు. రేషన్కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, నాయకులు నూకల వేణుగోపాల్రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, చల్లా నాగమ్మ పాల్గొన్నారు.
నల్లగొండ, డిసెంబర్ 28: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. గురువారం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని డైట్ కళాశాలలో 5, 21వ వార్డులతో పాటు తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామాలకు చెందిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభయ హస్తం ఐదు గ్యారంటీలకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నల్లగొండ సిటీ : కనగల్ మండలంలోని బుడమర్లపల్లిలో తాసీల్దార్ జ్యోతి, మార్తోనిగూడెంలో ఎంపీఓ ముజీబుద్దీన్, ఇరుగంటిపల్లిలో ఎంపీడీఓ సోమసుందర్రెడ్డి, ఏమిరెడ్డిగూడెంలో సూపరింటెండెంట్ అల్తాఫ్హమీద్ ఆధ్వర్యంలో ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచులు ఏమిరెడ్డి పద్మ, బండమీది రాము, కుడాలి రాజేశ్వరి, పార్వతమ్మ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : నల్లగొండ మండలంలోని ఆరు గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాకుల కొండారం, చెన్నుగూడెం, రాములబండ, దీపకుంట, రసూల్పురం, అన్నారెడ్డిగూడెం గ్రామాల్లో మొత్తం 1164 రేషన్ కార్డుదారులు ఉండగా 523 మంది వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాల్లో రెషన్ కార్డుల వారీగా దరఖాస్తు ఫారలను అందజేసినప్పటీకి.. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకుండా హడావిడిగా కార్యక్రమం నిర్వహించడంతో దరఖాస్తు చేసుకోవడానికి సగం మంది ముందుకు రాలేదు. ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. డీఆర్డీఏ అడిషనల్ పీడీ నవీన్కూమార్ పర్యవేక్షించారు.
తిప్పర్తి : మండలంలోని రాయినిగూడెం, కాశీవారిగూడెం, గంగన్నపాలెం, అంతయ్యగూడెం గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయినీగూడెంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ప్రారంభించారు. గురువారం మొత్తం 399 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీఓ మహేందర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవి, ప్రత్యేకాధికారి భూమన్న, సర్పంచ్ మైనం నాగయ్య, డీఈ నాగయ్య పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని భాస్కర్లబాయి, నల్లకుంటబోళ్లు, మల్లారం గ్రామాల్లో ఎంపీపీ ముత్తి లింగయ్య, ఎంపీడీఓ సునీత, తాసీల్దార్ స్వప్న ప్రజాపాలన గ్రామ సభలను ప్రారంభించారు. మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సర్పంచులు చినపాక పరశురాములు, పొన్నబోయిన లింగమ్మ, ఎంపీటీసీలు పాలడుగు హరికృష్ణ,
శాలిగౌరారం : మండలంలోని రామగిరి, జాలోనిగూడెం, బండమీదిగూడెం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. జాలోనిగూడెంలో జడ్పీటీసీ రణీలాయాదగిరి, మండల ప్రత్యేకాధికారి శ్రీధర్రెడ్డి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తాసీల్దార్ పాల్సింగ్, ఎంపీడీఓ లక్ష్మయ్య, సర్పంచులు పాల్గొన్నారు.
కేతేపల్లి : మండలంలోని కొత్తపేట, ఉప్పలపహాడ్ గ్రామాల్లో ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, మండల ప్రత్యేకాధికారి శ్రవణ్కుమార్, ఎంపీడీఓ హరికృష్ణ, తాసీల్దార్ మధుసూదన్రెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సర్పంచులు బచ్చు జానకిరాములు, గుర్రం శశికళ, అధికారులు పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని మర్రిగూడ, వట్టిపల్లి, దామెరభీమనపల్లి, కొట్టాల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, డీటీ తారకారామన్, సర్పంచులు పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని కల్వకుంట్ల, చల్మెడ, పలివెల, కల్వపల్లి గ్రామాలల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జడ్పీసీ సీఈఓ ప్రేమకరణ్రెడ్డి, ఆర్డీఓ కె. దామోదర్రావు, ఎంపీపీ కర్నాటిస్వామియాదవ్, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, ఎంపీడీఓ ఆర్. భాస్కర్గౌడ్, తాసీల్దార్ నరేందర్, సర్పంచులు పాల్గొన్నారు.
గట్టుప్పల్ : మండలంలోని కమ్మగూడెం గ్రామంలో తాసీల్దార్ లావణ్య ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
దేవరకొండ : పట్టణంలోని 20 వార్డుల్లో మొదటి రోజు 1342 దరఖాస్తులు స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు వార్డులతో పాటు మున్సిపల్ కార్యాలయంలో మరో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ చెప్పారు. ఆయన వెంట ఏఈ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండలంలోని చింతచెట్టతండా గ్రామంలో 191మంది, దంజిలాల్తండాలో 48, గుర్రపుతండాలో 61, పెండ్లిపాకల గ్రామంలో 227 మంది అభయహస్తం పథకాలకు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీఓ బాలరాజురెడ్డి, తాసీల్దార్ జి. దివ్వారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు రమావత్ లలితా భీంసింగ్నాయక్, మేకల పార్వతమ్మాశ్రీనివాస్ నాయక్, ఎంపీటీసీ రమావత్ జగన్నాయక్ పాల్గొన్నారు.
చందంపేట : మండలంలోని చందంపేట, బిల్డింగ్తండా, బుడ్డోనితండా గ్రామాల్లో గురువారం 500 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీఓ రాములునాయక్, తాసీల్దార్ రాములు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నూన్సావత్ పార్వతీచందునాయక్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
నేరేడుగొమ్ము : మండలంలోని బుగ్గతండా, బచ్చాపురం, కాచరాజుపల్లి గ్రామాల్లో సుమారు 400 దరఖాస్తులు వచ్చినట్లు తాసీల్దార్ అరుణమ్మ, ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మిబాయి తెలిపారు. ఎంపీపీ పద్మ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని పీఏపల్లి, బాలాజీనగర్, చిలకమర్రి, పీఏపల్లి గ్రామాల్లో ఎంపీడీఓ దేవిక దరఖాస్తులు స్వీకరించారు. సీఐ రాఘవేందర్రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపహాడ్ తండాలో 92, కొత్తపేటలో 90, రుద్రారంలో 66, కుంటకింది తండా 80, జాలుబాయితండాలో 56 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి వెళ్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవమ్మ, ఎంపీటీసీ ఆవుల రజితాదేవేందర్రెడ్డి, సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : మండలంలోని గోన్యాతండాలో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. మండల ప్రత్యేకాధికారి శ్రీకాంత్, ఎంపీపీ బాలాజీనాయక్, తాసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ మసూద్షరీఫ్, సర్పంచ్ పాతులోతు సైదమ్మ పాల్గొన్నారు.
మాడ్గులపల్లి : మండలంలోని అభంగాపురం గ్రామంలో ప్రభుత్వ పథకాలకు అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బొల్లారం భిక్షపతి, తాసీల్దార్ జమీరొద్ద్దీన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వేములపల్లి : మండలంలోని అన్నపరెడ్డిగూడెం గ్రామంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీపీ పుట్టల సునీత, డీఎస్పీ వెంకటగిరి, ఎంపీడీఓ జానయ్య, తాసీల్దార్ శ్రీనివాస్శర్మ పాల్గొన్నారు.
నిడమనూరు : మండలంలోని బొక్కమంతల పహాడ్, బంకాపురం, ఇండ్లకోటయ్య గూడెం, బంటువారి గూడెం గ్రామాల్లో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండలంలో తొలిరోజు 936 దరఖాస్తులు వచ్చినట్లు తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, ఎంపీడీఓ కె. ప్రమోద్కుమార్ తెలిపారు. నోడల్ అధికారులు రషీద్, రమేశ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హాలియా : మున్సిపాలిటీలోని 1,2 వార్డులు, మండలంలోని కొత్తపల్లి, హజారిగూడెం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి రాజ్కుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, తాసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ లక్ష్మి, వార్డు కౌన్సిలర్లు, అదికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
పెద్దవూర : మండలంలో తుంగతుర్తి, పిన్నవూర. నాయనావానికుంటతండా గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీడీఓ కె. విజయకుమరి, డీటీ శ్రీదేవి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గుర్రంపోడ్ : మండలంలో మొదటిరోజు 764 దరఖాస్తులు వచ్చినట్లు మండల ప్రత్యేకాధికారి రామచంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, తాసీల్దార్ మహ్మద్ తౌఫిక్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్,అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్) : మండలంలోని సుంకిశాల, కొంపెల్లి, బోయగూడెం, సీతల్తండా, రంగుండ్ల గ్రామాల్లో 1367 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ ఖాజా అజ్ఘర్అలీ తెలిపారు.
త్రిపురారం : మండలంలోని అల్వాలపాడు, చెన్నాయిపాలెం, రూప్లాతండా, లచ్యాతండా గ్రామాల్లో ప్రజాపాలన సభలు నిర్వహించారు. ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్, తాసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, అధికారులు పాల్గొన్నారు.
నందికొండ : మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో 107, 2వ వార్డులో 123 దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్రెడ్డి తెలిపారు.
దామరచర్ల : రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఆరుగ్యారెంటీలకోసం గురువారం మండలంలోని కొండ్రపోల్, రాళ్లవాగుతండా, పర్తూనాయక్తండా, జేత్రాంతండా, మంగళదుబ్బతండాల్లో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు ఎలా నింపాలో అర్ధం కాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తప్పులు దొర్లడంతో దరఖాస్తులు వృథా అయ్యాయి.
ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు ఇవ్వడంతో తమకు ఒకే పథకం వస్తుందేమోనని వృద్ధులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో మొత్తం 13,620 కుటుంబాలకు సరిపోయేలా దరఖాస్తులు పంపిణీ చేశారు. అయితే ఒక్కో కుటుంబంలో పలు పథకాలకు వేర్వేగా దరఖాస్తు తీసుకోవడంతో కొరత ఏర్పడింది. దాంతో అధికారులు దరఖాస్తులను జిరాక్స్ తీయించి అందించారు. ఆర్డీఓ చెన్నయ్య, ఎంపీపీ రమావత్ నందిని పరిశీలించారు. తాసీల్దార్ శంకర్నాయక్, ఎంపీడీఓ కృష్ణమూర్తి అధికారులు పాల్గొన్నారు.