మంత్రి కేటీఆర్ను కోరిన ఎమ్మెల్యే చిరుమర్తి
నకిరేకల్, జూలై 5 : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీలతోపాటు నియోజకవర్గంలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయించాలని మంత్రి కేటీఆర్ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి కేటీఆర్తోపాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.