కట్టంగూర్(నకిరేకల్): సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణానికి చెందిన బ్రహ్మదేవర కృష్ణమూర్తి అనారోగ్యంతో దవాఖానలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. అతనికి మంజూరైన రూ. 4లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును బుధవారం తన క్యాంపు క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేసి మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్లు రాచకొండ సునీల్, పల్లె విజయ్, టీఆర్ఎస్ నాయకులు నడికుడి వెంక టేశ్వర్లు, మాద నగేశ్, గుర్రం గణేశ్, మురారిశెట్టి కృష్ణమూర్తి, యల్లపురెడ్డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.