నిడమనూరు, జనవరి 20 : ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని పార్వతీపురంలో రెండో రోజు కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన నేత్ర సంబంధ రుగ్మతలను నయం చేసేం దుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని కొనియాడారు. కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. వైద్యాధికారి డాక్టర్ మాధవ్ కుమార్ ఆధ్వ ర్యంలో గ్రామంలో 118 మందికి పరీక్షలు నిర్వహించి 67మందికి, ఎర్రగూడెంలో 105 మందికి పరీక్షలు నిర్వహించి 24 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ అంజయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చేకూరి హనుమంతరావు,తాసీల్దార్ ప్రమీల, ఎంపీడీఓ ప్రమోద్కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు సత్యపాల్, రవియాదవ్, వైస్ ఎంపీపీ వెంకట్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ రామలింగయ్య, ఎం పీఓ రామలింగయ్య, సర్పంచులు బ్రహ్మన్న, రవి, రాములు, మార్కెట్ డైరెక్టర్లు సత్యనారాయణరెడ్డి, లచ్చయ్య, శ్రీనివాస్రావు,వెంకన్న పాల్గొన్నారు.
త్రిపురారం : మండల కేంద్రంలోని రైతువేదికలో, మండలంలోని రాగడపలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను డిప్యూటీ డీఎంహెచ్ఓ కేసా రవి, క్వాలిటీ డాక్టర్ సుధీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమయపాలన పాటించాలని, ప్రతిరోజూ 200 మంది వచ్చేలా ఆశా కార్యకర్తలు ఆహ్వానపత్రికలను ముందురోజు పంపించాలని సూచించా రు. అవసరమైన వారికి మాత్రమే ఆపరేషన్లు రిఫర్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆఫ్తామా లజిస్ట్ వెంకటేశ్వర్లు, సీహెచ్ఓలు స్వామి,తావునాయక్, హెచ్ఈఓ వాసుదేవరెడ్డి, డాక్టర్ రమావత్ శంకర్, సూపర్వైజర్లు గోపాల్రెడ్డి, లక్ష్మీనారాయణ, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
నందికొండ : సాగర్ హిల్కాలనీ మొదటి వార్డులోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో రెండో రోజు శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం కొనసాగింది. 141 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 77 మందికి అద్దాలను అందజేశారు. 27 మందికి సర్జరీకి రెఫర్ చేశారు. డాక్టర్ బిర్లా, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : మండలంలో కంటి వెలుగు కార్యక్రమం రెండు రోజులుగా కొనసాగుతున్నది. పీఏ పల్లిలో ఇప్పటివరకు 235 మంది, ఘాట్నెమలిపురం 240 మందికి పరీక్షలు నిర్వహించి 100 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి యుగేంధర్ తెలిపారు.
తిరుమలగిరి సాగర్ : కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామస్తులంతా సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ అస్గర్ అలీ అన్నారు. శుక్రవారం మండలంలోని శీతలతండాలో కంటి వెలుగు శిబి రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు.తండాలో 125 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 10 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని, నలుగురిని సర్జరీకి రెఫర్ చేశామని వైద్యాధికారి సోమయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ పద్మ, ఏపీఎం లక్ష్మీనారాయణ, సర్పంచ్ చందూలాల్, ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మిర్యాలగూడ :పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం. వెంకయ్య శుక్రవారం పరిశీలించారు. రీడింగ్ సైట్ ఉన్నవారికి వెంటనే అద్దాలు ఇస్తున్నట్లు తెలిపారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని రుద్రారంలో శుక్రవారం రెండో రోజు కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి షేక్ మోహీద్ ప్రారంభించారు. కొత్తగూడెం, యాద్గార్పల్లి, వెంకటాద్రిపాలెం గ్రామాల్లో కంటి వెలుగు ప్రోగ్రాం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రజితాదేవేందర్రెడ్డి, జగదీశ్, హెచ్సీఓ ప్రభాకర్, ఓంగారమ్మ పాల్గొన్నారు.
దామరచర్ల : మండలంలో రెండోరోజు కంటి వెలుగు శిబిరాలు సాగుతున్నాయి. మండలంలోని బెట్టతండా, బాలాజీనగర్తండాల్లో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు గిరిజనులు భారీగా తరలి వస్తున్నారు. వైద్యులు నాగేశ్వరరావు, కార్తీక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో మొత్తం 554 మందికి పరీక్షలు నిర్వహించి 127 మందికి అద్దాలు అందజేశారు.45 మందికి ఆపరేషన్లు అవ సరమని గుర్తించారు. ఎంపీడీఓ కృష్ణమూరి, ఎం పీఓ మోసిన్అలీ, మండల వైద్యాధికారి శ్రీనాథ్, సర్పంచ్ రవీందర్నాయక్ పర్యవేక్షిస్తున్నారు.
అడవిదేవులపల్లి : మండల కేంద్రంలో రెండోరోజు కంటి వెలుగు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమైన వారికి వైద్య సిబ్బంది అద్దాలు, మందులు అందజేస్తు న్నారు. కార్యక్రమంలో వైద్యులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
హాలియా: మొదటి రోజు కంటి పరీక్షల్లో మండలంలోని అన్నారం గ్రామంలో వైద్యులు 171 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 37 మందికి అద్దాలు అందజేశారు. రెండోరోజు శుక్రవారం గ్రామంలో 121 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 29 మందికి అద్దాలు పంపిణీ చేశారు. రెండో రోజు మండలంలోని మూడు గ్రామాల్లో 397మందికి కంటి పరీక్షలు చేసి 63 మందికి అద్దాలు అందజేసినట్లు మండల వైద్యాధికారి రామకృష్ణ విలేకరులకు తెలిపారు.