కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ద్వారా ఆదివారం 2152.95 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా 1909.20 క్యూసెక్కులు, కాలువలకు 142.83 క్యూసెక్కులు వెళుతుండగా, 49.07 క్యూసెక్కులు ఆవిరవుతుంది.
ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 2847..75 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 643.12 అడుగులు(3.97 టీఎంసీలు)గా ఉంది.