‘మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయిండు. గ్రామాల్లో ఎన్నడూ కనిపించని ఆయనకు ఎందుకు ఓటెయ్యాలె.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మర్రిగూడ మండలంలోని రాజుపేట తండాలో బుధవారం ఉదయం గిరిజనులతో గ్రామసభ నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీని గెలిపిస్తే మూడు వేల పింఛన్ ఇస్తామని ఆ పార్టీ నాయకులు అంటున్నారని.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.750, కర్ణాటకలో రూ.600 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. మోటర్లకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలో, అభివృద్ధి చేసే..తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడే టీఆర్ఎస్ పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. డబ్బు సంచులు, మందు సీసాలతో మభ్యపెట్టడానికి వస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని కోరారు. మర్రిగూడ మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీల నుంచి 200 మంది మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మర్రిగూడ, అక్టోబర్ 19 : ‘18వేల కోట్ల రూపాయలకు బీజేపీకి అమ్ముడుబోయిన రాజగోపాల్రెడ్డి గెలిస్తే అతనికి లాభం అవుతుంది.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలందరికీ మేలు జరుగుతుంది.. మునుగోడు ఉప ఎన్నికలో ఒక వ్యక్తి గెలువాలా? ప్రజలు గెలువాలా? ఆలోచించాలి’? అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం మర్రిగూడ మండలం రాజుపేటతండా వాసులతో మంత్రి సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు. వారి తో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మర్రిగూడలోని విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలో ని పలు గ్రామాలకు చెందిన కాం గ్రెస్, బీజేపీ నుంచి 200 మం ది కార్యకర్తలు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండు వా క ప్పి మంత్రి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడారు. మళ్లీమళ్లీ మోసం చేసే రాజగోపాల్కు ప్రజలు అవకాశం ఇవ్వరన్నారు. కనబడని రాజగోపాల్ కావా లో? మునుగోడును అభివృద్ధి చేసే టీఆర్ఎస్ను గెలిపించాలో! ప్రజలు ఆలోచించాలన్నారు. మర్రిగూడను చూడని రాజగోపాల్రెడ్డికి ఓటు వేయబోమని మర్రిగూడ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. మునుగోడు ప్రజలకు పాలేందో, నీళ్లేందో అర్థమైందని, టీఆర్ఎస్ ను గెలిపించుకుంటేనే మునుగోడు అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ట్యాంకర్లతో నీళ్లు మోసుకొని ఎంత బాధపడ్డామో? మునుగోడు ప్రజలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఫ్లోరైడ్ బాధతో వైకల్యం కలిగిన బాధితులు మన కండ్ల ముందే ఉన్నారన్నారు.
ఫ్లోరైడ్ సమస్య తీర్చింది కేసీఆర్నే
నల్లగొండకు ఫ్లోరైడ్ సమస్యను తీర్చిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఎన్నిక ఎవరి కోసం వచ్చిందో? ఎందుకు వచ్చిందో? ఎవరి స్వార్థం కోసం వచ్చిందో? ప్రజలు ఆలోచించాలని కోరా రు. రాజగోపాల్ గెలిస్తే ఏం లాభం లేదని, టీఆర్ఎస్ను తిట్టడం తప్పా ఇంకేమైనా చేస్తాడా? అని ప్రశ్నించారు. మద్యం, డబ్బుతో గెలుస్తామన్న బీజేపీ కుయుక్తులను మర్రిగూడ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడులో పేదలకు వెయ్యి ఇండ్లు కట్టమని ఇస్తే, కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్రెడ్డి ఒక్క ఇల్లూ కట్టియ్యలేదన్నారు.
కాంగ్రెస్ పత్తా లేకుండానే పోయిందని, బీజేపీ మందు సీసాలు, పైసలు ఇచ్చి ఓట్లు కొనాలని చూస్తున్నదని విమర్శించారు. సొంతింటి జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. ‘మర్రిగూడ అభివృద్ధి నా బాధ్యత.. ప్రతీ మూడు నెలలకోసారి గ్రామానికి వస్తానని, యేడాదిలో మర్రిగూడను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారే వారితో నష్టం ఏమి లేదన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, రాజీనామా చేసిన వారందరికీ తగిన గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ బచ్చు రామకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, సర్పంచ్ నల్ల యాదయ్య, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్గౌడ్, దళితబంధు జిల్లా డైరెక్టర్ లపంగి నర్సింహ, కో-ఆప్షన్మెంబర్ ఎండీ యాకూబ్ పాల్గొన్నారు.