మునుగోడు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ సంఘం చైర్పర్సన్ నారబోయిన స్వరూపారాణి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో జడ్పీటీసీ నిధుల నుంచి ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైన్స్లోని పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు ల్యాబ్ను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో యాకూబ్ నాయక్, నాయబ్ తాసీల్దార్ విజయలక్ష్మి, సర్పంచ్ మిర్యాల వెంకన్న, వైస్ ఎంపీపీ అనంత వీణ, టీఆర్ఎస్ నాయకుడు నారబోయిన రవి, లింగస్వామి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ.రఫీక్, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి, ఈద నిర్మల, పీఆర్ ఏఈ రామకృష్ణ, నాయకులు దాడి శ్రీనివాసరెడ్డి, బొడ్డు నాగరాజుగౌడ్, శరత్, జంగిలి నాగరాజు, బండారు మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.