నల్లగొండ ప్రతినిధి, జూలై 4(నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తూనే ఉంది. తాజాగా నియోజకవర్గంలోని గ్రామాల మధ్య లింకు రోడ్లకు పంచాయతీరాజ్ విభాగం నుంచి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేసింది. ఈ నెల 1న జీఓ ఆర్టీ 288 విడుదల చేస్తూ మొత్తం 38 రోడ్లకు రూ.74.16 కోట్లను కేటాయించింది. మొత్తం ఆరు మండలాల్లోని పలు గ్రామాల మధ్య ఇప్పటివరకు మట్టి రోడ్లుగా ఉన్న వాటిని బీటీ రోడ్లుగా మార్చనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేలా ఆదేశాలిచ్చారు. మునుగోడు మండలంలో వెల్మకన్నె- కల్వకుంట్ల, కచలాపురం-సింగారం, ఊకొండి- తాళ్లవెల్లంల, పులిపలుపుల-బీరెల్లిగూడెం, మునుగోడు నార్కట్పల్లి మెయిన్ రోడ్డు నుంచి రత్తిపల్లి, పులిపలుపుల-ఊకొండి క్రాస్ రోడ్, మునుగోడు-చౌటుప్పల్ ఆర్అండ్బీ రోడ్డు నుంచి గుండ్లోరిగూడెం, పలివెల సర్వేల్ రోడ్డు నుంచి కోతులారం, కల్వలపల్లి- కేశవారిగూడెం, మునుగోడు- చౌటుప్పల్ ఆర్ అండ్ బీ రోడ్డులో 21/2 కి.మీ నుంచి కొరటికల్, చొల్లేడు-బోడంగిపర్తి…ఇలా మొత్తం 11 రోడ్లు మంజూరయ్యాయి. చౌటుప్పల్ మండలంలో తూప్రాన్పేట కాట్రేవ్ – ఎల్లంబావి, సింగారాయిచెర్వు-తమ్మలోనిబావి, పెద్దకొండూరు- సప్పిడివారి గూడెం, చిన్నకొండూరు జుబ్లక్పల్లి రోడ్డు నుంచి మసీదుగూడెం, అల్లాపురం తుంబాయితండా రోడ్డు నుంచి సరళమైసమ్మ ఆలయం వరకు, పంతంగి – శినిలగుట్ట వరకు మొత్తం ఏడు రోడ్లు మంజూరయ్యాయి.
నారాయణపురం మండలంలో కొత్తగూడెం నుంచి కర్మగూడెం మీదుగా గట్టుప్పల్ చౌటుప్పల్ ఆర్అండ్బీ రోడ్డు వరకు, లింగవారిగూడెం నుంచి చల్మెడ వరకు, అల్లందేవిచెర్వు నుంచి నాగంవారిగూడెం వరకు, సర్వేల్ నుంచి రాజన్నగూడెం వరకు, నారాయణపురం నుంచి దుబ్బల్లకు వెళ్లే రోడ్డుపై కల్వర్టు నిర్మాణం మొత్తం ఆరు పనులు మంజూరయ్యాయి. చండూరు మండలంలో కనగల్ మర్రిగూడెం రోడ్డు నుంచి జోగిగూడెం రోడ్డు, పుల్లెంల నుంచి బోడంగిపర్తి, శిర్ధేపల్లి నుంచి తాస్కానిగూడెం, లకినేనిగూడెం నుంచి చొప్పరివారిగూడెం, చండూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పడమటితాళ్ల వరకు, కనగల్ మర్రిగూడెం రోడ్డు నుంచి ఉడతలపల్లి మీదుగా దుబ్బగూడెం వరకు, కొరటికల్ నుంచి శిర్దేపల్లి రోడ్డు, తిమ్మారెడ్డిగూడెం నుంచి మల్లగుట్ట వరకు, పుల్లెంల నుంచి గొల్లగూడెం వరకు మొత్తం 9 బీటీ రోడ్లు మంజూరయ్యాయి. నాంపల్లి మండలంలో గట్ల మల్లేపల్లి నుంచి తుమ్మలపల్లి రోడ్డు, కేతేపల్లి నుంచి తిరమలగిరి పీడబ్ల్యూడీ రోడ్డు వరకు, కొండమల్లేపల్లి పీడబ్య్లూడీ రోడ్డు నుంచి బండా తిమ్మాపురం వరకు మూడు రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. మర్రిగూడ మండలంలో అంతపేట నుంచి గట్టుప్పల్ రోడ్డు, బట్లపల్లి నుంచి వట్టిపల్లి వరకు, లంకెలపల్లి నుంచి నెర్మట వెళ్లే రోడ్డుపై కల్వర్టు నిర్మాణం మొత్తం మూడు పనులు మంజూరయ్యాయి.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యం. గ్రామాల మధ్య లింకురోడ్లను బీటీలు మార్చేందుకు ప్రస్తుతం నిధులు విడుదల అయ్యాయి. నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి
జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు -కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే, మునుగోడు
నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది
మా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. మాగ్రామం మండల కేంద్రానికి కూతపెట్టు దూరంలోనే ఉన్నప్పటికీ సరైనా రోడ్డు మార్గం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉండేది. బీటీ రోడ్డు ఏర్పాటైయితే మా ఊరు అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొత్త పంచాయతీ చేసింది. ఇప్పుడు రోడ్డు కూడా వేస్తున్నది. మా గ్రామ ప్రజలం సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి రుణపడి ఉంటాం.
-చొప్పరి వెంకన్న, చొప్పరివారిగూడెం, చండూరు మండలం