యాదాద్రి భువనగిరి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప పోరులో మొత్తం 93.13 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,41,805 ఓటర్లు ఉండగా 2,25,192 ఓట్లు పోలయ్యాయి. 13 కేంద్రాల్లో రాత్రి 9.30 గంటల దాకా ఓటేశారు. ఒక కేంద్రంలో మాత్రం మరింత ఆలస్యం కావడంతో 1.30 గంటలకు ఈవీఎంను తరలించారు. నారాయణపురం మండలంలో అత్యధికంగా 93.76 శాతం, మర్రిగూడ మండలంలో అత్యల్పంగా 91.41శాతం పోలింగ్ నమోదైంది.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప పోరులో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 93.13శాతం ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా.. 2,25,192 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,13,853 పురుషుల ఓట్లు, 1,11,338 మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఓట్లున్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు మందకొండిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత ఊపందుకుంది. సాయంత్రం సమయంలో ఓట్లు వేసేందుకు క్యూ కట్టారు. కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి దాకా పోలింగ్ కొనసాగింది. 13కేంద్రాల్లో రాత్రి 9:30గంటల దాకా ఓటేశారు. ఒక కేంద్రంలో మాత్రం మరింత ఆలస్యం కావడంతో అర్ధరాత్రి 1:30గంటలకు ఈవీఎంను తరలించారు. స్ట్రాంగ్ రూమ్లో తెల్లవారుజామున 4:40గంటలకు సీల్ వేశారు.
నారాయణపురంలో 93.76 శాతం..
మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే నారాయణపురం మండలంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మొత్తం 36,430 ఓట్లుండగా.. 93.76శాతంతో 34,157ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత చౌటుప్పల్లో 93.68శాతం, చండూరులో 63.51శాతం, మునుగోడులో 93.50శాతం, గట్టుప్పల్లో 92.61శాతం, నాంపల్లి మండలంలో 92.37శాతం పోలింగ్ నమోదైంది. మర్రిగూడలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ 28,309 ఓట్లుండగా 91.41శాతంతో 25,877 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మండలాలవారీగా పోలింగ్ వివరాలు..