త్రిపురారం, ఫిబ్రవరి 1: సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఎంపీఓ భిక్షంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు శుక్రవారం నుంచి బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. త్రిపురారం, సత్యనారాయణపురం గ్రామాలకు ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, రూప్లాతండా, లోక్యతండా, అప్పలమ్మగూడెం గ్రామాలకు తాసీల్దార్ గాజుల ప్రమీల, పెద్దదేవులపల్లి, బాబుసాయిపేట గ్రామాలకు ఎంపీఓ భిక్షంరాజు, బొర్రాయిపాలెం, రాజేంద్రనగర్ గ్రామాలకు పీఆర్ ఏఈ వెంకట్రెడ్డి, కాపువారిగూడెం, లచ్యాతండా,
పలుగుతండా గ్రామాలకు ఆర్అండ్బీ ఏఈ బీ.శ్రీనివాస్, డొంకతండా, బడాయిగడ్డకు మిషన్ భగీరథ ఏఈ ప్రవీణ్, దుగ్గెపల్లి, అన్నారం, కంపసాగర్కు ఎన్ఎస్పీ ఏఈ ఎండీ. ఆయేషా, కామారెడ్డిగూడెం, కంపాలపల్లి, బృందావనపురం, కొణతాలపల్లి గ్రామాలకు ఎన్ఎస్పీ ఏఈ ఎస్.నరేశ్, బెజ్జికల్, మర్రిగూడేనికి ఏఓ పార్వతీచౌహాన్, అంజనపల్లి, నీలాయగూడేనికి పశువైద్యాధికారి ఙ్ఞానేశ్వర్ ప్రసాద్, మాటూ రు, వస్రాంతండాకు హెచ్ఓ కె.మురళి, రాగడప, కుంకుడుచెట్టుకు సూపరింటెండెంట్ వి.సత్యప్రభ, చెన్నాయిపాలెం, సత్యంపాడుతండా, అల్వాలపాడు గ్రామాలకు డీటీ గాదె సైదులును నియమించినట్లు తెలిపారు.
చందంపేట : మండలంలోని 28 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఎంపీడీఓ రాములునాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బిల్డింగ్తండా, మనావత్తడా, పోలేపల్లి గ్రామాలకు ఎంపీడీఓ రాములునాయక్, గుంటిపల్లి, గన్నెర్లపల్లి, చందంపేటకు తాసీల్దార్ రాములు, అచ్చంపేటపట్టి, ముడుదండ్ల, పోల్యానాయక్తండాకు పశువైద్యాధికారి ధనలక్ష్మి, గాగిళ్లాపురం, కాట్రావత్తండాకు ఏఓ లక్పతి, పెద్దమూల, చిత్రియాలకు ఎంపీఎస్ఓ క్రాంతి, రేకులగడ్డ, బుడ్డోనితండా, యాపలపాయతండాకు సర్వేయర్ జాన్సెన్ సామేల్, ముర్పునూతల, హంక్యాతండా, కోరుట్లకు ఇరిగేషన్ ఏఈ రాధ, తెల్దేవర్పల్లి, మోత్యతండాకు పీఆర్ ఏఈ జి.రాజునాయక్, పాత తెల్దేవర్పల్లి, బొల్లారం, యల్మలమందకు ఎంపీఓ సీహెచ్. జానయ్య, పాత కంబాలపల్లి, గువ్వలగుట్టకు డీటీ గోవర్ధన్రెడ్డి, కంబాలపల్లి, పొగిళ్ల గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శేఖర్ను నియమించినట్లు పేర్కొన్నారు.
చిట్యాల : మండలాన్ని 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్లకు ఒక్కో మండల అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు ఎంపీడీఓ లాజర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. . వనిపాకల, వట్టిమర్తి గ్రామాల క్లస్టర్లను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నర్సింహ, నేరడ, ఎలికట్టె క్లస్టర్లకు ఆర్అండ్బీ ఏఈ సంతోష్కుమార్, ఉరుమడ్ల, తాళ్లవెల్లంల, వేంబావి క్లస్టర్లకు ఎంపీడీఓ బీ.లాజర్, పెద్దకాపర్తి, ఆరెగూడెం క్లస్టర్లకు ఎంపీఓ పద్మ, చిన్నకాపర్తి, బోయగుబ్బ క్లస్టర్లకు ఏఓ గిరిబాబు, వెల్మినేడు, పిట్టంపల్లి, బొంగొని చెర్వు క్లస్టర్లకు పశువైద్యాధికారి అమరేందర్, ఏపూరు, పేరెపల్లి క్లస్టర్లకు డిప్యూటీ తాసీల్దార్ రాగ్యా నాయక్, గుండ్రాంపల్లి, సుంకెనపల్లి క్లస్టర్లకు తాసీల్దార్ దశరథను నియమించినట్లు వివరించారు.
కొండమల్లేపల్లి : మండలంలోని కొండమల్లేపల్లి, జానిగానితండా గ్రామాలకు ఎంపీడీఓ బాలరాజురెడ్డి, చింతకుంట్ల, కొర్రతండాకు తాసీల్దార్ దివ్వారెడ్డి, పెండ్లిపాకల, గుడితండాకు ఆర్ అండ్ బీ ఆధికారి సతీశ్, చెన్నంనేనిపల్లి, రమావత్తండా, వర్ధమానిగూడేనికి ఏఈ ధర్మేంద్ర, గుమ్మడవెల్లి, దవరోనితండా, గౌరికుంటతండాకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మల్యాద్రి, గాజీనగర్, చింతచెట్టుతండా, వడ్త్యాతండాకు డీఈ శైలజ, చిన్నఅడిశర్లపల్లి, దొనియాల, కొల్ముంతల్పహాడ్కు ఏఓ వెంకన్న, కొత్తబావి, రామునిగుండ్లతండాకు భగీరథ ఏఈ కె. లింగం, కేశ్యాతండా, అంబోతుతండా, గుర్రపుతండాకు ఏఈ జైల్సింగ్, చెన్నారం, దంజిలాల్తండా, గాన్యానాయక్తండాకు ఏఈ సరితను ప్రత్యేకాధికారులుగా నియమించారు.