హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యంను శుక్రవారం రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితుల గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారివెంట రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి, మల్లు కపొత్తం రెడ్డి తదితరులు ఉన్నారు.