కేతేపల్లి, అక్టోబర్ 25 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని చీకటిగూడేనికి చెందిన 50 మంది వివిధ పార్టీల నుంచి నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ను అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదే అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టో గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు.
గడపగడపకూ తిరుగుతూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎగ్గడి సత్యనారాయణ, బుద్దె గణేశ్, కోట కాంతారావు, బుద్దె శ్రీనివాస్, బుర్రి రాఘవేందర్రావు, ఆల్దాసు సతీశ్ తదితరులు ఉన్నారు. గ్రామశాఖ అధ్యక్షుడు నల్లపు నాగేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, ఎంపీటీసీ దాచేపల్లి నర్మదానాగేశ్వర్రావు, నాయకులు కోట పూర్ణచందర్రావు, కోట సంపత్, నర్సయ్య పాల్గొన్నారు.