సూర్యాపేట టౌన్, అక్టోబర్ 27 : సూర్యాపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసిన మంత్రి జగదీశ్రెడ్డి వెంటే సూర్యాపేట ప్రజలు ఉన్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమక్షంలో పెన్పహాడ్ మండలం నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన సుమారు 100మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలనలోనే జరిగిన అభివృద్ధిని ప్రజలంతా ఆనందంగా ఆస్వాదిస్తున్నారన్నారు.
నిరంతర అభివృద్ధి పాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఇస్తున్న నెరవేర్చలేని హామీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. అందుకే ఈ ఎన్నికలో విపక్షాలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ఈ ఎన్నికలో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. అద్భుతమైన ప్రజాదరణతో ఇప్పటికే ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి సీఎంగా కేసీఆర్, మంత్రిగా జగదీశ్ రెడ్డిలు హ్యాట్రిక్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో పొదిల వెంకట రాంనర్సయ్య, దుర్గారావు, లక్ష్మీనారాయణ, తోట కృష్ణ, తోట అశోక్, పొదిల సుదర్శన్, పొదిల కొండల్, శ్రీను, ప్రవీణ్, ప్రేమ్, శ్రీనివాస్, వెంకటదుర్గ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, నాయకులు తూముల ఇంద్రసేనారావు, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, చెన్ను శ్రీనివాస్రెడ్డి, నెమ్మాది కృష్ణ పాల్గొన్నారు.