నకిరేకల్, అక్టోబర్ 25 : కాంగ్రెస్ మొదటి లిస్ట్కే గాంధీభవన్కు తాళాలు వేసుకున్నారని.. రెండో లిస్ట్ ప్రకటిస్తే జుట్లు పట్టకుని అంగీలు చింపుకునే పరిస్థితి వస్తుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. నాలుగు పార్టీలు మారేటోళ్లు, పూటకో రంగు మార్చేటోళ్లు కాంగ్రెస్ నాయకులు అని, నల్లగొండలో నలుగురు ముఖ్యమంత్రులు తయారవుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజక వర్గంలో ఎన్నికల ఇన్చార్జిగా చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటం.. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలి.. ఇక్కడ చిరుమర్తి లింగయ్యే మళ్లీ ఎమ్మెల్యేగా గెలువాలని చిరుమర్తికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలిపారు. బియ్యం, ఉచిత కరెంట్, రైతు బంధు, రుణ మాఫీ, రైతు బీమా, కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత, కాళేశ్వరం ప్రాజెక్ట్తో సాగునీరు. ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం మళ్లీ రావాలని చెప్పి ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు సీఎం కేసీఆర్ను, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గెలిపించుకోవాలని చూస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రేపటి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లి, ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ఆరు డిక్లరేషన్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కర్ణాటకలో రెండు, మూడు గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి ఆ పార్టీకి లేదని విమర్శించారు. ఛత్తీస్గఢ్లో పండిన పంటను కొనే నాథుడే లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మన జిల్లాలో నలుగురు ముఖ్యమంత్రులు తయారయ్యారని, జానారెడ్డి, వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి సీఎం పదవి కోసం కొట్లాడుతున్నారే తప్పా, ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేని నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్లోకి ఇంకో ఆయన వస్తున్నారంటున్నారు. నాలుగు పార్టీలు మారేటాయన, పూటకో రంగు మార్చేటాయన వస్తున్నడంటున్నరు.
ఆయన కూడా ముఖ్యమంత్రి అంటాడేమో అన్నారు. మన నియోజక వర్గం ప్రశాంతంగా ఉండాలన్నా, అరాచకాలు, రౌడీయిజం లేకుండా ప్రజలు ఎవరి పని వారు చేసుకుని జీవించాలంటే సౌమ్యుడు, అభివృద్ధి కోసం పనిచేసే వాడు, చెడును ప్రొత్సహించని వ్యక్తి చిరుమర్తి లింగయ్యను గెలిపించుకోవాలని కోరారు. రూ.200 కోట్లతో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్, రూ.100 కోట్లతో అయిటిపాముల లిఫ్ట్, రూ.75 కోట్లతో కేతెపల్లి మూసీ రైట్ కెనాల్ పనులు, నకిరేకల్లో రూ.135 కోట్లతో వంద పడకల ఆస్పత్రి, రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, తిప్పర్తి రోడ్డు, కడపర్తి రోడ్డు అభివృద్ధి పనులు చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని తిరిగి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.
రామన్నపేట, అక్టోబర్70 : అభివృద్ధి, సంక్షేమాన్ని సుస్థిరంగా అందజేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని నిధానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై పూజలు నిర్వహించి నిధానపల్లి, ఇంద్రాపాలనగరం గ్రామాల్లో గడపగడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటేస్తే 3 గంటల కరెంట్, బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు పెడుతారన్నారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలి కూర్చీల కోసం కోట్లాడుకుంటారన్నారు. ఇప్పటికే జిల్లాకు ముగ్గురు ముఖ్యమంత్రులం మేమే అంటూ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రతి గ్రామంలో కోటి రూపాయలకు పైగా అభివృద్ధి చేశామన్నారు. ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చినట్లు, మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. అరాచాకాలు కాకుండా ప్రశాతంగా సాగుతున్న పాలనకే తిరిగి పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, సర్పంచులు గుత్తా నర్సింహారెడ్డి, కాటేపల్లి యాదయ్య, ఎడ్ల మహేందర్రెడ్డి, మదర్ డెయిరీ డైరక్టర్ మందడి ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షులు గర్దాసు విక్రమ్, వర్కాల మొగలయ్య, నాయకులు పున్న జగన్మోహన్, కన్నెబోయిన బలరామ్, అంతటి రమేశ్, మందడి సాగర్రెడ్డి, బందెల రాములు, బొక్క పురుషోత్తమ్రెడ్డి, మందడి శ్రీధర్రెడ్డి, సాల్వేరు అశోక్, మంటి లింగస్వామి, నిమ్మగడ్డ పద్మారావు పాల్గొన్నారు.