మాడ్గులపల్లి, నవంబర్ 19 : బీఆర్ఎస్తోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని పాములపాడు, పోరెడ్డిగూడెం, చిరుమర్తి, ఆగామోత్కూర్, గుర్రప్పగూడెం, బొమ్మకల్ గ్రామాల్లో మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల కింద ఉన్న మిర్యాలగూడను ఇప్పటి మిర్యాలగూడను పరిశీలిస్తే ఎమ్మెల్యే భాస్కర్రావు చేసిన అభివృద్ధి ఏమిటనేది తెలిసి పోతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తూ ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన పదేండ్ల కాలంలోనే గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమాను అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ ప్రకించిన మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేసింది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు అన్ని అంతర్గత రోడ్లను సీసీగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కోట్ల రూపాయలను వెచ్చించి చెరువులను అభివృద్ధి చేసి ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చిందన్నారు. రైతులకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ను అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశ చరిత్రలో నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్ రూ.4వేల నుంచి రూ.6వేలకు, ఆసరా పింఛన్ రూ.5వేలకు పెంచనున్నట్లు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో వాటి రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఒకప్పుడు పల్లెలు మురుగు కూపాలుగా ఉండగా నేడు పచ్చదనం, పరిశుభ్రతతో విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. గత పాలకుల హయాంతో దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా పట్టించుకోలేదని, కానీ సీఎం కేసీఆర్ ప్రజల ఇబ్బందులు ముందుగానే తెలుసుకొని వారు అడుగకున్నా గ్రామాల్లో మళిక వసతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, డంపింగ్యార్డు, పల్లెప్రకృతివనం, వైకుంఠధామాలు వంటి అనేక నిర్మాణాలు చేపట్టారన్నారు. రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించినట్లు చెప్పారు.
ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు అమలుకు సాధ్యం కాని పథకాలతో మ్యానిఫెస్టోను రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు వారి మాయ మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్యారాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, పీఏసీఎస్ చైర్మన్లు రాములుగౌడ్, గడ్డం స్పృధర్రెడ్డి, సర్పంచులు యాతం లక్ష్మి, పోరెడ్డి కోటిరెడ్డి, నాంపల్లి శ్రీశైలం, అఫ్జల్, కర్ర వనమ్మ, మారుతి వెంకట్రెడ్డి, నాయకులు రాజు, కృపాకర్, చొక్కారావు, చింతకాయల సైదులు, మధుసూదన్ పాల్గొన్నారు.