భువనగిరి: త్రివిధదళాధిపతి బిపిన్ రావత్తోపాటు, వీర మరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూవాహిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాశాల విద్యార్థులతో కలిసి శనివారం బాబాజగ్జీవన్రామ్ చౌరస్తా నుంచి వినాయకచౌరస్తా వరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువాహిని జిల్లా అధ్యక్షుడు గీస ఆనంద్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన బిపిన్ రావత్జీ సేవలు మరువలేనివన్నారు.
వీరుల త్యాగాలకు దేశం రుణపడిపడి ఉందన్నారు. ఈ ర్యాలీలో జిల్లా ప్రదానకార్యదర్శి పంచెద్దుల భరత్, పట్టణ అధ్యక్షుడు కడారి శివకుమార్, మండల అధ్యక్షుడు సంతోష్, రత్నపురం ప్రవీణ్, దూసరి శ్రీకాంత్, రావుల మహేష్, జాగృతి కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.