సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 09 : వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్, నియమ నిబంధనలు, సూచనలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లకు సంభందించి కొత్త బస్టాండ్ వద్ద సంబంధిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో రహదారులపై ఉన్న ట్రాఫిక్ రద్దీని, రోడ్ల వెంబడి నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను సందర్శించారు. వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించేలా ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పునరుద్ధరణ, ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందన్నారు. ఈ సందర్భం గా అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్ల పనులను వేగంగా పూర్తి చేయాలని, మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించేలా ప్రజలను వాహనదారులను ముందస్తుగా అప్రమత్తం చేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణకు సంబంధించి అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, ఆర్టీసీ అధికారులను సంప్రదించి జిల్లా కేంద్రంలో, కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు, మార్గాలను సులభతరం చేయాలని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పోలీస్ సిబ్బందిని బలోపేతం చేస్తామని అన్నారు. వాహనదా రులు ట్రాఫిక్ నియమాలు రోడ్డు నియమాలు పాటించి రోడ్డు ప్రమా దాలకు గురవకుండా సురక్షితంగా గమ్యం చేరుకోవాలని అన్నారు. వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం కలు గుతుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు.