మోత్కూరు, జనవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని, అందుకే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని సాయి ఆస్పత్రి డాక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, నాయకులు వెంకన్న, వెంకటయ్య, అనిల్కుమార్, కల్యాణ్చక్రవర్తి పాల్గొన్నారు.
తిరుమలగిరిలో..
తిరుమలగిరి : మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, సర్పంచ్ ఆకుల వీరయ్య పాల్గొన్నారు.