కట్టంగూర్, నవంబర్ 19 : స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాటు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తుండగా దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. కేవలం నాలుగున్నరేండ్లలోనే నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.1500కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్న బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్కు రూ.150 కోట్లు విడుదల కాగా టన్నెల్ పనులు పూర్తిచేయడంతోపాటు ట్రయల్న్ కూడా నిర్వహించారు.
నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం మండలాల్లో 10వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అయిటిపాముల లిఫ్ట్కు రూ.100 కోట్లు మంజూరు కాగా లిఫ్ట్ నిర్మాణ పనులకు మంత్రి తన్నీరు హరీశ్రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేశారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల భూ సేకరణ నిధులకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నకిరేకల్ ఆస్పత్రిని 100 పడకలకు మార్చేందుకు రూ.32 కోట్లు మంజూరు చేసింది. నకిరేకల్లో రూ.4.50 కోట్లతో మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తి చేశారు. నకిరేకల్లో మెయిన్రోడ్డు విస్తరణ పనులు పూర్తికగా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు, సమీకృత మార్కెట్ నిర్మాణంలో ఉన్నాయి.
చిట్యాల మున్సిపాలిటీలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా అందులో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. నార్కట్పల్లిలో రూ.16 కోట్లు, రామన్నపేటలో రూ.8.50 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. మరోవైపు గ్రామాలకు అద్దం లాంటి రోడ్లు, పల్లెల్లో సీసీ రోడ్లు వేశారు. పల్లె, పట్టణ ప్రగతితో పంచాయతీలు, మున్సిపాలిటీలు పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతుండడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో 3 మండలాల్లోని 11 గ్రామాల రైతులకు ప్రయోజనం కలిగేలా కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ నిర్మాణ పనులకు ఇటీవల మంత్రులు తన్నీరు హరీశ్రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే కట్టంగూర్, నకిరేకల్, శాలిగౌరారం మండలాల్లోని 11 గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి.
రైతుబంధు పథకం కింద నియోజకవర్గంలో 87 వేల మంది రైతులకు రూ.105 కోట్ల పెట్టుబడి సాయం, 860 మంది రైతులు మృతిచెందగా రైతుబీమా పథకం కింద రూ.43కోట్లు, దళితబంధు కింద మొదటి విడుతగా వంద మందికి రూ.10 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద 6,680 మందికి రూ.7 కోట్లు, సీఎం సహాయ నిధి నుంచి 5 వేల మందికి రూ.30 కోట్లు, 12,110 మందికి కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, గొర్లకాపర్లకు రూ.4 కోట్లతో 270 గొర్రెల యూనిట్లు, మత్స్యకారులకు ఉపాధి కోసం రూ.6కోట్ల విలువైన 5 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేశారు. అలాగే 43 వేల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నారు.
నకిరేకల్లో ప్రస్తుతం ఉన్న 30 పడకల కమ్యూనిటీ వైద్యశాలను రూ.32 కోట్లతో 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 2021 చివరలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 90 శాతం పనులు పూర్తయయాయి.
నియోజకవర్గంలో రూ.15 కోట్లతో పల్లె ప్రకృతి వనాలు, రూ.5 కోట్లతో బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రూ.5 కోట్లతో క్రీడా ప్రాంగణాలు, రూ.5 కోట్లతో రైతువేదికలు నిర్మించారు. 11ఆరోగ్య ఉప కేంద్రాలకు రూ.2.20కోట్లు, రూ.6.80 కోట్లతో రెండు చెక్డ్యామ్లు, 18 గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు రూ.3.60కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయి.
రూ.150 కోట్లతో చేపట్టిన నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ సొరంగ మార్గం పనులు పూర్తవడంతో ఇటీవల ట్రయల్న్ నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాల్వల కోసం భూసేకరణకు రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందనున్నది.
నకిరేకల్ మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణంలో రూ.26 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా 6 ఫీట్ల వెడల్పుతో మురుగు కాల్వలు, రోడ్డు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. తిప్పర్తి రోడ్డు, మార్కెట్ రోడ్డు విస్తరణ కోసం రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నకిరేకల్లో అత్యాధునిక హంగులతో సమీకృత మార్కెట్ నిర్మించేందుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 40 స్టాల్స్తో చేపట్టిన మార్కెట్ పనులు శరవేంగా జరుగుతున్నాయి.
కాలంవారికుంటను మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. తొలి విడుతగా రూ.75 లక్షలతో కట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు. దీంతో నకిరేకల్ పట్టణ రూపురేఖలు మారనున్నాయి. అలాగే చిట్యాల మున్సిపాలిటీలో రూ.20 కోట్లతో అభివృద్ధఙ పనులు చేట్టారు. వాటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని పనులు శరవేగంగా జరుగుతున్నారు. రూ.5కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రెండు కమ్యూనిటీ హాళ్లు, రూ.1.20 కోట్లతో వైకుంఠధామం పనులు జరుగుతున్నాయి. పట్టణంలో జరుగుతున్న పనులు 70 శాతం పూర్తికావచ్చాయి. రూ.2 కోట్లతో చేపట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
నాలుగున్నరేండ్లలో నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు నియోజవర్గంలోని ప్రతి గడపకూ అందుతున్నాయి. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు నకిరేకల్ పట్టణంలో రూ.32 కోట్లతో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయిటిపాములలో రూ.100 కోట్లతో చేపట్టనున్న లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేశాం. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్కు రూ.200కోట్లు విడుదల కాగా టన్నెల్ పనులు పూర్తిచేయడంతోపాటు ట్రయల్ రన్ కూడా నిర్వహించాం. నార్కట్పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులతోపాటు నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, మురుగు కాల్వల నిర్మాణ పనులు కొన్ని పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతా.
-ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య