గుర్రంపోడు, ఏప్రిల్ 09 : గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ అమెరికా ప్రధాన కార్యదర్శి నాగులవంచ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు, నాగులవంచ పరశురామ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీ ధనంజయ్, సర్పంచులు మారపాక శంకర్, సింగం బాలకృష్ణ, సల్వాది సత్యవతి నగేశ్, చెవ్వు రమేశ్, మాజీ సర్పంచ్, సల్వాది నగేశ్, ఉప సర్పంచ్ ఐతగోని వెంకటేశం, పార్టీ నాయకులు రామగిరి చంద్రశేఖర్ రావు, నాగులవంచ వెంకట శ్రీనివాస్ రావు, సింగం ప్రవీణ్, కామల్ల రాములు, ఐతగోని కృష్ణ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, వల్కి చంటి, కూనూరు సైదిరెడ్డి, నాగులవంచ నాగేశ్వరరావు, జక్కల సైదులు, ఐతరాజ ప్రసాద్, నీరుడు శ్రీను, ఐతరాజు నాగరాజు, పామన గుండ్ల వెంకన్న, ఉపేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దోటి గణేష్, ఆవుల కృష్ణ, మామిడి నరేశ్, ఆవుల కుమార్, బొల్లం నరేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.