మిర్యాలగూడ టౌన్, జనవరి 4 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. రైతుబంధు సంబురాలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ మండలస్థాయి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంబురాల్లో భాగంగా ఈ నెల 7న హైస్కూల్ స్థాయి విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు, 8న గ్రామస్థాయిలో కోలాటాలు, 9న రైతువేదికలను అందంగా ముస్తాబు చేస్తామని, 10న మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయంలో విజయోత్సవ సమావేశం నిర్వహించ నున్నట్లు చెప్పారు. సమావేశానికి రైతులు సంప్రదాయ దుస్తులతో రావాలని సూచిం చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మట్టపల్లి సైదయ్య, జొన్నలగడ్డ రంగారెడ్డి, పద్మయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అభివృద్ధికి అధిక నిధులు
మాడ్గులపల్లి : అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని కల్వెలపాలెం గ్రామ పరిధిలోని పాలేరు వాగుపై రహదారుల శాఖ, ఎఫ్డీఆర్ స్టేట్ నాన్ప్లాన్ నిధులు రూ. 4కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జిపనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పనులను పారదర్శకంగా చేపట్టాలని గుత్తేదారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్య, జడ్పీటీసీ పుల్లెంల సైదులు, జడ్పీకోఆప్షన్ సభ్యుడు మోషన్ అలీ, తాసీల్దార్ అర్చన, ఎంపీడీఓ జితేందర్రెడ్డి, ఎస్ఈ నర్సింహ, ఈఈ నరేందర్, డీఈ గణేశ్ సర్పంచ్ గడ్డమీది సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబయ్య పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
పట్టణంలోని 34వ వార్డు గాంధీనగర్ బ్రాహ్మణ బజారులో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే భాస్కర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కౌన్సిలర్ ఉబ్బపల్లి వెంకమ్మ, నాయకులు మధు, ఫహిమొద్దీన్ పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
పీఆర్టీయూ రూపొందించిన కొత్త సంవత్సర క్యాలెండర్ను మంగళవారం క్యాంపు కార్యాలయంలో మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు ఆవిష్కరించారు. ఎంఈఓ బాలాజీనాయక్, పీఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్రావు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాన్ని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.