కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 988.39 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా 661.53 క్యూసెక్కులు వెళుతుండగా, కాలువలకు 73.21 క్యూసెక్కులు వెళుతుంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 644.45 అడుగులు(4.32 టీఎసీలు)గా ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు.