కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4883.92 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.
కాలువల నుంచి 5082.21 క్యూసెక్కులు అవుట్ఫ్లో వెళుతుంది. ప్రాజెక్టు 2క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 4815.91 క్యూసెక్కులు, కాలువలకు 167.72 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.30 అడుగులుగా (4.02 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.