కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 1487.94 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కాలువల నుంచి 754.53 క్యూసె క్కులు అవుట్ఫ్లో వెళుతుంది. ప్రాజెక్టు
క్రస్టు గేట్ ద్వారా దిగువకు 1943.35 క్యూసెక్కులు, కాలువలకు 97.26 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 644.20 అడుగులుగా (4.25 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.