శాలిగౌరారం: మొక్కలను సంరక్షించడంలో సంబంధిత అధికారులు అలసత్వం చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పెర్కకొండారం గ్రామ శివారులోని నేషనల్ హైవే వెంట నాటిన మొక్కలను జోరు వానలోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గొడుగు సహాయంతో మొక్కలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
నాటిన మొక్కకు ట్రీగార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో ఒక్క మొక్క కూడా వృధా కాకూడదని అన్నారు. అదేవిధంగా మెగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటులో నిర్లక్ష్యం చేయొద్ద న్నారు. ఆయన వెంట డీపీవో విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీవో రేఖల లక్ష్మయ్య ఉన్నారు.