నల్లగొండ : పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసును వెళ్లగక్కారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను అవహేళన చేస్తూ కించపరిచిన ప్రధాని క్షమాపణలు చెప్పాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
చిట్యాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుంచి మోదీ అయిష్టంగానే ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల విరోచిత పోరాటాలతో సాధించుకున్న రాష్ట్ర ఏర్పాటుపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదాన్నారు.
అహంకారంతో అధికారమదంతో తెలంగాణను అపహాస్యం చేసిన మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.