త్రిపురారం, ఏప్రిల్ 21 : పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, గ్రామగ్రామాన బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని వివరించాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఓటర్లంతా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పే మాయమాటలకు లొంగవద్దని, ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించడానికి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, త్రిపురారం మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిడమనూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, మడుపు వెంకటేశ్వర్లు, శ్యాంసుందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గుండెబోయిన వెంకన్నయాదవ్, అనుముల శ్రీనివాస్రెడ్డి, చిమట మట్టయ్య, కలకొండ వెంకటేశ్వర్లు, పెద్ద వెంకటయ్య పాల్గొన్నారు.