అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ సర్కారు వైపే ముదిరాజ్లు ఉన్నారని, సీఎం కేసీఆర్ పాలనను మరోసారి కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ముదిరాజ్ అన్నారు. భువనగిరిలో సోమవారం నిర్వహించిన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్తోనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, మరోసారి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ భువనగిరిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపానని, ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా చేయాలని కోరారు. పెద్ద సంఖ్యలో ముదిరాజ్లు హాజరై బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు.
భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 6 : ముదిరాజులంతా ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దత్తునందించాలని ఎమ్మెల్సీ బండ ప్రకాష్ముదిరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పట్టణ పరిధిలోని ఏకే ప్యాలెస్లో నిర్వహించిన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో భువనగిరి నియోజకర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మాజీ చైర్మన్ పెంట నర్సింహ, కొలుపుల అమర్నాథ్, కౌన్సిలర్లు, ముదిరాజులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేసి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమానికి ఎంతో చేసిందని గుర్తుచేశారు.