కట్టంగూర్, మార్చి 11 : సర్కార్ దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వీముల వీరేశం అన్నారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం, పరడ, ఈదులూరు, మునుకుంట్ల, పందనపల్లి, అయిటిపాముల, బొల్లేపల్లి, ఇస్మాయిల్పల్లి గ్రామాల్లో రూ.90లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించిన దవాఖాన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నన్నారు. వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ లోకసాని వేణుగోపాల్రెడ్డి, ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్రావు, వైద్యాధికారి శ్వేత, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, నాయకులు సుంకరబోయిన నర్సింహ, సుక్కయ్య, సైదులు, వెంకన్న, నారాయణ, అంజయ్య, యాదగిరి, సుధీర్రెడ్డి, వెంకట్రెడ్డి, దానయ్య, సాగర్, శేఖర్ పాల్గొన్నారు.
చిట్యాల : పట్టణంలో చెత్త సేకరణ వాహనాన్ని, మంచినీటి ట్యాంకును మిర్యాలగూడ ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ వాహనాలకు అందజేయాలన్నారు. అంతకుముందు కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు పూలమ్మ, జయమ్మ, పద్మ, మౌనిక, లింగస్వామి, కృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.