నకిరేకల్, జనవరి 29 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని తాటికల్, నర్సింహాపురం, మర్రూర్, మోదినిగూడెం, వల్లభాపురం గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధుల రూ.55 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనాలు, సీసీరోడ్లు, మురుగు కాల్వ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్డీఎఫ్ కింద ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, ఎంపీడీఓ రమేశ్, ఎంఈఓ నాగయ్య, మం డల ప్రత్యేకాధికారి ప్రభాకర్, సర్పంచులు పవన్రెడ్డి, స్వప్నా శ్యాంసుందర్, జయమ్మా యాదగిరి, ఎంపీటీసీలు శ్రీలతాకొండ య్య, వీరార్జున్రెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.
నార్కట్పల్లి : గ్రామాలను అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని అక్కెనపల్లి, చిన్నతుమ్మలగూడెం, చిప్పలపల్లి, తొండల్వాయి, మాండ్ర, కొండపాకగూడెం, నార్కట్పల్లి, యడవల్లి, ఏపీ లింగోటం గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల ఊషయ్య, పాశం శ్రీనివాస్రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.