చిట్యాల, డిసెంబర్ 31 : కరాటే మనిషి జీవన విధానాన్ని మార్చివేసి మానసికంగా, శారీరకంగా శక్తిమంతుడిగా మారుస్తున్నది నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం గుండ్రాంపల్లిలో యోద్దా గోజుర్యు స్పోర్ట్స్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
కరాటే తక్కువ ప్రచారం ఉందని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ ను పాఠ్యాంశాలలో సబ్జెక్టుగా చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, ఎంపీటీసీ దుబ్బ పద్మాకుమారస్వామి, మాజీ ఎంపీటీసీలు బండ గిరిజ, బండ కిష్టయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నమ్ముల విజయ్కుమార్, రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
చిట్యాల :మండలంలోని బొంగోని చెరువు గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ సామిడి మోహన్రెడ్డి ఆదివారం నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రామాలయం చైర్మన్ సాయికృష్ణ్ణారెడ్డి , నాయకులు నర్సిరెడ్డి, శ్రీధర్రెడ్డి, రవీందర్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ :సీనియర్ ఉపాధ్యాయుడు, యూటీఎఫ్ నాయకులు బిచినేపల్లి శ్రీనివాసరావు సంస్మరణ సభ ఆదివారం నకిరేకల్ జడ్పీహెచ్ఎస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సంక్షేమ నిధి నుంచి మంజూరైన రూ. 6 లక్షల చెక్కును ఎమ్మెల్యే వేముల వీరేశం, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం పాల్గొన్నారు.