నార్కట్పల్లి/కేతేపల్లి /కట్టంగూర్, జనవరి 5 : పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్, పామనుగుండ్ల, ఎరసానిగూడెం, నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామాల్లో శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో కట్టంగూర్ ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, తాసీల్దార్లు పద్మ, స్వప్న, మండల నోడల్ అధికారి విజయేందర్రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేతేపల్లి మండల కార్యక్రమంలో ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, పీఏసీఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్రెడ్డి, సర్పంచ్ గోలి మంజుల పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు : సాగర్ ఎమ్మెల్యే జయవీర్రెడ్డి
హాలియా/ పెద్దవూర/ తిరుమలగిరి(సాగర్)/ మాడ్గులపల్లి / : అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అందజేస్తామని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. మండలంలోని పులిమామిడి, తిరుమలగిరి (సాగర్) మండలం గర్కనెట్తండా, పెద్దవూర మండల కేంద్రం, మాడ్గులపల్లి మండలం కన్నెకల్లో శుక్రవారం జరిగిన గ్రామ సభల్లో ఆయన మాట్లాడారు. అర్హులైన వారు దరఖాస్తులు నింపి శనివారంలోగా గ్రామంలో సంబంధింత అధికారికి అందజేయాలని కోరారు.
హాలియా నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రాజ్కుమార్, వైస్ ఎంపీపీ మాలె అరుణ, ఎంపీడీఓ గోళ్ల లక్ష్మి, కుందూరు వెంకట్రెడ్డి, గౌని రాజా రమేశ్ యాదవ్, కుందూరు రాజేందర్రెడ్డి, చింతల చంద్రారెడ్డి పాల్గొన్నారు.తిరుమలగిరి సాగర్ మండలంలో పీఆర్ ఏఈ సైదులు, ఎంపీటీసీ రాకేశ్, గడ్డం సాగర్రెడ్డి, వల్లపురెడ్డి పెద్దవూర లో ఎంపీపీ చెన్ను అనురాధాసుందర్రెడ్డి, ఎంపీడీఓ కె.విజయ కుమారి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి , మాడ్గులపల్లిలో పీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య, సర్పంచ్ కాటేపల్లి సరిత, ఎంపీడీఓ జితేందర్రెడ్డి పాల్గొన్నారు.
పేదలను ఆదుకునేందుకే పథకాలు : ఎమ్మెల్యే బీఎల్ఆర్
మిర్యాలగూడ రూరల్ : పేదల ఆదుకునేందుకు ప్రభు త్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని,అర్హులందరూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని వాటర్ట్యాంకు తండాలో శుక్రవారం ప్రజా పాలన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు సంక్షేమ పథకాలను అందజేస్తుందన్నారు. వాటిని పొందాలంటే ముందుగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఒక్క రోజే అవకాశం ఉందని గుర్తు చేశారు. అలాగే లావూడి తండాకు చెందిన యువకులు, ఉద్యోగులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్రు, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీఓ వీరారెడ్డి , వెటర్నరీ ఏడీఏ జూలకంటి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని ఎలగలగూడెం, ఇప్పర్తి, కోతులారం ఊకొండి గ్రా మాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి కోతులారంలోని ప్రజాపాలన సభలో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్గౌడ్, తాసీల్దార్ నరేందర్, డీటీ నరేశ్ పాల్గొన్నారు.
హాలియా : మండలంలోని అన్నారం గ్రా మ ప్రజాపాలనలో ఆర్డీఓ చెన్నయ్య పాల్గొని దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. కార్యక్రమంలో తాసీల్దార్ జయశ్రీ, పాల్గొన్నారు.
తిప్పర్తి: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి అన్నారు. మండలంలోని తానేదార్పల్లి, కంకణాలపల్లి గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. పాశం సంపత్రెడ్డి, ముత్తినేని శ్యాంసుందర్,ఎంపీడీఓ మహేందర్రెడ్డి పాల్గొన్నారు.