హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కీలకమైన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సిద్ధమైంది. ఆర్వీ అసోసియేట్స్ రూపొందించిన తుది పీఎఫ్ఆర్ను రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది. పీఎఫ్ఆర్లో తమ్మిడిహట్టి వద్ద వైన్గంగ, వార్ధా నదులపై రెండు బరాజ్లు నిర్మించి వాటిని కాంక్రీట్ బండ్తో అనుసంధానించాలని ప్రతిపాదించినట్టు సమాచారం.
152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 165 టీఎంసీలు, 150 మీటర్ల వద్ద 129 టీఎంసీలు, 149 మీటర్ల వద్ద 80 టీఎంసీలు, 148 మీటర్ల వద్ద 58 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని హైడ్రాలజీ పేరొన్నట్టు తెలిసింది. మైలారం నుంచి బొగ్గు బ్లాకులను తప్పిస్తూ 22 కిమీ టన్నెల్, 5 కి.మీ ఓపెన్ కెనాల్ద్వారా సుందిళ్లకు నీటి తరలింపు ప్రతిపాదించినట్టు సమాచారం.