మఠంపల్లి, అక్టోబర్ 22 : ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మఠంపల్లిలో గల లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల, రూరల్ గ్రామాల ఆర్ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేశారన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ఎంపీలు గ్రామస్థాయిలో ఎన్నో వైద్య సహాయాలు అందించారన్నారు. మండల కేంద్రాల్లో అసోసియేషన్ బిల్డింగుల నిర్మాణానికి స్థలాలు ఇప్పిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జాల తిరపయ్య, శంషుద్దీన్, ప్రధాన కార్యదర్శి జి.రామారావు, ముఖ్య సలహాదారు పీవీబీ చారి, ఉపాద్యక్షుడు ప్రకాశ్, వెంకటేశ్వర్లు, బుజ్జా, కొండలు పాల్గొన్నారు.
మఠంపల్లి : మండలానికి చెందిన సత్తారపు వీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా బీఆర్ఎస్ బీమా కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదివారం అందించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అభివృద్ధితో పాటు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. పార్టీ తరపున ప్రమాద బీమా చెక్కు అందించడంపై వీరయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మన్నెం శ్రీనివాస్రెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, నవీన్నాయక్, కోలాహలం కృష్ణంరాజు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : దసరా పండుగను నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని కనకదుర్గ ఆలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన సతీమణితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, కౌన్సిలర్లు గురవయ్య, ఫణికుమారి పాల్గొన్నారు.