పెద్దఅడిశర్లపల్లి, డిసెంబర్ 5 : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభ్వుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని నక్కలపెంటతండా సమీపంలో నాగార్జునసాగర్ బ్యాక్వాటర్లో ప్రభుత్వ ఉచితంగా అందించిన 18 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నదన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల చెరువుల్లో చేప పిల్లలను వదిలినట్లు ఆయన చెప్పారు. పెరిగిన చేపలను మత్స్యకారులు అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం సబ్సిడీపై ఆటోలు, మోపెడ్లు, బైక్లను అందిస్తున్నదని పేర్కొన్నారు. చేపల పెంపకం కోసం సీడ్ ఉత్పత్తి కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నదన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్ అధిక నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మనఊరు, మన ప్రభుత్వంలో భాగంగా పీఏపల్లి మండలం ఎర్రగుంటతండాలో రూ.20 లక్షలు, మల్లాపురంలో రూ.20లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, వైస్ చైర్మన్ అర్వపల్లి నర్సింహ, సర్పంచులు ఎడమ వెంకటయ్య, రమావత్ టమ్మీ, శీలం శేఖర్రెడ్డి, ఎర్ర యాదగిరి, బోయ సుధాకర్రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ, మహేందర్, శ్రీను, రమావత్ చందు, కిషన్ నాయకులు జటావత్ స్వామినాయక్, రవినాయక్ పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి అధిక నిధులు
కొండమల్లేపల్లి : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని ఆంబోతుతండాలో రూ.5 లక్షలతో చేపట్టిన ఆంజనేయస్వామి ఆలయ ప్రహరీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, ప్రధాన కార్యదర్శి పస్నూరి యుగేంధర్రెడ్డి, మేకల శ్రీనివాస్యాదవ్, సర్పంచ్ ఆంబోతు పవన్, రమావత్ తులసీరాం, రమావత్ శ్రీను, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ రాములు, లాలూనాయక్, వీరస్వామి, శంకర్నాయక్, లస్కర్ పాల్గొన్నారు.