కొండమల్లేపల్లి, ఏప్రిల్ 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమాల పితామహుడు అని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గత పాలకుల హయాంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశానికే రోల్మోడల్గా మారిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారని, ఇంటింటికీ సరిపడా మంచినీరు అందిస్తున్నారని, పల్లెలు, పట్టణాల్లో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు సగం కూడా లేవని, మహారాష్ట్రలో పింఛన్ రూ.600 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. గతంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే ప్రధాని మోదీ రూ.1200 చేసి సామాన్యుల నడ్డి విరిచారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులు పదో తరగతి పరీక్ష పత్రాలను లీక్ చేశారని విమర్శించారు. తెలంగాణలో 2014కు ముందు అకలి చావులు ఉండేవని, సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, ప్రజలు మూడు పూటలా కడుపు నిండా తింటున్నారని తెలిపారు. ఇప్పటికీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అకలి చావులు కొనసాగుతున్నాయన్నారు.
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని, అందుకే యావత్ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ర్టానికి కేంద్రం నుంచి రావలసిన బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. మోదీ దేశానికి, తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని, ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. కేంద్రంలో మోదీ దుర్మార్గాలను నిలువరించేందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అదానీ, అంబానీ మాత్రమే బాగుపడ్డారని తెలిపారు. మోదీని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మతిభ్రమించిందని, పదో తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని, సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
రమావత్ రవీంద్రకుమార్
శృతి మించుతున్న బీజేపీ దుర్మార్గాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సాధ్యమయ్యాయన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని సూచించారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని, కొండమల్లేపల్లి మండలంలోని 26 గ్రామపంచాయతీల్లో ఎనిమిదేండ్లలో రూ.300 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పాత్ర కీలకం కానుందని, దేవరకొండ నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ గెలుపుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 27న ప్రతి గ్రామంలో, వార్డుల్లో పార్టీ జెండా పండుగ నిర్వహించాలన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీలు వంగాల ప్రతాప్రెడ్డి, సునీతాజనార్దన్రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకుడు కడారి అంజయ్యయాదవ్, నాయకులు యుగేంధర్రెడ్డి, రవీందర్రెడ్డి, రాంబాబునాయక్, శ్రీనివాస్యాదవ్, లాలూనాయక్, ఏడుకొండల్, సురేశ్, వెంకటయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.