దేవరకొండ:పేద, బడుగు,బలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక భరోసా కల్పిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానకి చెందిన పద్మయ్యకు రూ. 31వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన నిధులు అత్యవసర పరిస్ధితుల్లో ఉపయోగపడుతాయని తెలిపారు.
ప్రాణపాయ స్ధితిలో వున్నప్పుడు బాధితులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ ను అందిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నల్లగాసు జాన్యాదవ్, మండల రైతు బంద్ అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్, వేముల రాజు, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, మోహన్, బొడ్డుపల్లి కృష్ణ, రాజు తదితరులున్నారు.