మాల్ చింతపల్లి: టిఆర్ఎస్ నాయకురాలు గొంది వెంకటనర్సమ్మ మృతి బాధాకరమని, ఆమె మృతి పార్టీకి తీరనిలోటు అని ఎమ్మెల్యే రామావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గొంది వెంకటనర్సమ్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ ఆమె మృతి పార్టీకి తీరని లోటన్నారు.
ఈ సందర్భంగా ఆయనతోపాటు రాష్ట్ర టిఆర్ఎస్ నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యా సాగర్రావు, నాయకులు గున్రెడ్డి శ్రీనివాస్రెడ్డి, గొపిడి కిష్టారెడ్డి, గిరిధర్, చింతకుంట్ల విజయ్, కిరణ్కుమార్రెడ్డి, జైపాల్రెడ్డితో పాటు అయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.